హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అకీరా సైకిల్ తొక్కుతుండగా కింద పడిపోవడంతో గాయాలు కాస్త తీవ్రంగానే అయ్యాయి. వెంటనే అకీరాను ఆసుపత్రికి తీసుకెళ్లినా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నొప్పి తట్టుకోలేక పిల్లాడు అల్లాడిపోయారడు . దీంతో అకీరా తల్లి రేణు దేశాయ్ వైద్యుల తీరుపై ఫైర్ అయింది. 'అకీరా సైకిల్ మీద నుండి కిందపడి గాయపడ్డారు. వెంటనే మంచి ఆసుపత్రికి తీసుకెళ్లాను. అయితే అక్కడ మాకు చేదు అనుభవమే ఎదురైంది. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వెయిట్ చేయించారు. ఆలస్యంగా వైద్యం చేసారు. అప్పటి వరకు అకీరా బాధ చూసి మన మనసు విలవిలాడింది. పెద్ద ఆసుత్రులకు ట్రీట్మెంటు కోసం వెళ్లడం కంటే నేరుగా చనిపోవడం మేలు అంటూ రేణు దేశాయ్ తన మనసులోని ఆక్రోశాన్నితన ట్విట్టర్ లో వెల్లగక్కారు.https://twitter.com/renuudesai
https://twitter.com/renuudesai
https://twitter.com/renuudesai
No comments:
Post a Comment